am

రేవంత్‌కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు

ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీ.టీడీపీ ముఖ్యనేత కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెండు నెలల అనంతరం హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ కేసులో జూన్ 30వ తేదీనే రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించినా కొడంగల్ నియోజ కవర్గానికే పరిమితం కావాలని హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌రెడ్డి తన ఆరోగ్యం బాగాలేదని వైద్యపరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందని కోర్టుకు తెలపడంతో ఆంక్షలు సడలిస్తూ మంగళవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆంక్షలు తొలగించడంతో రేవంత్ ఎప్పటిలాగే పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడపనున్నారు. రెండు నెలల అనంతరం రేవంత్ హైదరాబాద్‌కు రానుండడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతోఉన్నారు. ఈ రోజు ఉదయం కొడంగల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్‌రెడ్డికి పోలీసు అకాడమీ దగ్గర టీడీపీ కార్యకర్తల ఘనస్వాగతం పలికారు

No comments:

Post a Comment

.