చావుకు కూడా భయపడని గొప్ప
లక్షణం ప్రజాకవి కాళోజి నారాయణరావులో ఉండేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం
శ్రీహరి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై కాళోజి విమర్శించే తీరు అద్భుతంగా
ఉండేవన్నారు. కాళోజిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ
అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కడియం చెప్పారు. రవీంద్రభారతిలో జరిగిన
కాళోజి 101వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
మంత్రలు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాళోజి
పురస్కారాన్ని రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు చెందిన వేణుగోపాల్రావుకు
ప్రదానం చేశారు.
No comments:
Post a Comment