am

మద్యం లేక.. మంచం పట్టి!


  • గ్రామాల్లో స్వచ్ఛంద నిషేధం
  • మందుబాబుల అస్వస్థత
  • 3 రోజుల్లోనే వందమంది
  • భైంసా ఆస్పత్రిలో చేరిక 
  • సరిపోని పడకలు, నేలపై పడుకోబెట్టి చికిత్స 
ఎన్నో ఏళ్లుగా అలవాటైన మద్యం! ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది? నరాలు పట్టు తప్పాయి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోయింది. దీంతో ఆదివారం నలుగురు.. సోమవారం మరో 20 మంది.. ఒకరి తర్వాత ఒకరుగా అస్వస్థత పాలై ఆస్పత్రి బాటపట్టారు. మంగళవారానికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ఇదుగో ఇలా కిందే పడుకోబెట్టి చికిత్స చేయడం మొదలుపెట్టారు.
 
కామోల్‌లో వైద్యశిబిరం నిండిపోవడంతో.. భైంసా ఆస్పత్రిలో మందు బాబులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి ఒక్కో పడకపై ఇద్దరికి చికిత్స చేశారు. అవీ నిండిపోవడంతో.. ఇంకొంతమందిని నేలపైనే పడుకోబెట్టి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. మద్యం సేవించే అలవాటున్నవారు ఒక్కసారి మానేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కాశీనాథ్‌ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

.